📢 Advertisement Space

అనకాపల్లి జిల్లాలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ – జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు సమక్షంలో పార్టీలో చేరిన జాతీయ కిక్‌బాక్సింగ్ క్రీడాకారుడు కుసుమంచి ప్రసాద్

🗞️ బిబి న్యూస్ | 04 Jul 2026

అనకాపల్లి: భారతీయ జనతా పార్టీకి అనకాపల్లి జిల్లాలో రోజురోజుకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, యువకులు, క్రీడాకారులు స్వచ్ఛందంగా బీజేపీలో చేరుతూ పార్టీ బలోపేతానికి తమ వంతు సహకారం అందిస్తున్నారు.ఈ నేపథ్యంలో అనకాపల్లి కష్పావీధికి చెందిన ఆర్య వైశ్య సమాజ యువకుడు, జాతీయ కిక్‌బాక్సింగ్ క్రీడాకారుడు కుసుమంచి ప్రసాద్ శుక్రవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డెడ నాగేశ్వరరావు సమక్షంలో ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ప్రముఖ క్రీడా శిక్షకుడు దాడి వీరునాయుడు శిష్యుడైన కుసుమంచి ప్రసాద్ జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కిక్‌బాక్సింగ్ పోటీల్లో ప్రథమ స్థానాలు సాధించి ప్రతిభ చాటుకున్నారు.ఈ సందర్భంగా కుసుమంచి ప్రసాద్ మాట్లాడుతూ, దాడి వీరునాయుడు ఆశయాలు, సేవా దృక్పథం తనను ఎంతో ప్రభావితం చేశాయని తెలిపారు. ఆయన మార్గదర్శకత్వంలో జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు చేతుల మీదుగా బీజేపీ కండువా కప్పుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.జిల్లాలో బీజేపీకి అన్ని వర్గాల ప్రజల నుంచి లభిస్తున్న సానుకూల స్పందన పార్టీ మరింత బలపడుతున్నదానికి నిదర్శనమని నాయకులు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, పట్టణ బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కుసుమంచి ప్రసాద్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.